అగ్రకుల నాయకత్వంలోని తెలంగాణ ఉద్యమాలతో మాకు వనగూడింది ఏమిటి?మీ పిల్లలు విదేశాలలో వుంటే ప్రత్యేక తెలంగాణ రాస్ట్రం కోసముదళిత బహుజనులు బలికావాలా ...
అని 2ంద్ జూన్ ఆంద్ర జ్యొతి పపెర్ లో దుర్గం భాస్కర్ రీసర్చ్ స్కాలర్
శెట్టి ,తెలంగాణా ఉద్యమ కారుదు,
గాలి వినోద్ కుమర్,అస్సిస్టెంత్ ప్రొఫెసర్ మొదలైన వారు ఇంటర్ వ్యు ఇచ్చారు.
అంటె ఇన్ని సంవత్సరాలు నస్ట పోతె కాని ఆ సంగతి తెలీ లేదా?
1969 తెలంగాన ఉద్యమం లో 369 మందివిద్యార్ధులు అసువులు బాసారత.
ఈ రకముగా ఎంత మంది విద్యార్ధుల జీవితాలు నాసన ఈపోతున్నాయి?దీని కి కారణము ఏవరు?విద్యార్ధుల్లారా,ఒక్క నిమిషము ఆలోచించండి,మీ మీద ఏన్నొ అసలు పెట్టుకొని మీమ్మలిని ,మీ భవిస్యత్తును తీర్చి దిద్దాలని మీ తల్లి తంద్రులు మీ చదువు కోసము ఏంత పాటు పడుతున్నారు?
కడుపు కట్టుకొని మిమ్మలిని చదివిస్తే ఏదో బాగుపడతారని,తమని వుద్దరిస్త్తారని అనుకుంటారే కాని ఈ రకముగా కడుపులో చిచ్చు పెడతారని ఊహించరుగా !ఈ ఉద్యమాలు కడుపు నిండిన వారి కే కాని సామాన్య జనాని కి కాదు.
ఏ .సి కార్లలో జడ్ కటగిరి రక్షణ వలయములో వుండి ,ఏ.సి ఇళ్ళ లో బజ్జొని,బొజ్జ పెంచుకునే నాయకులు మిమ్మలిని ఏం వుద్దరిస్త్తారు?భారత స్వాతంత్ర వుద్యమము తరువాత బాగుపడింది ఏవరు?ఆ ఉద్యమము లో అసువులు బాసిన వారి కుటుంబాలు ఏమయ్యాయి?
కనీసము గాంధిజీ నైనా ,ఆయన జయంతి ,వర్ధంతి రోజున తప్ప మిగితా రోజులలో ఎంతమంది తలుచుకుంతున్నారు?
స్వాతంత్రము తరువాత బలపడింది నెహ్రూ కుటుంబము, తరతరాలు గా భారతదేశ పట్టాభిషెకం వారికే!తెలంగాణా ఉద్యమం తరువాత పట్టాభిషేకం చెన్నారెడ్డి కుటుంబానికే!ఇప్పుడు కే సి ఆర్ ,విజయశాంతికే గుర్తింపు.
అప్పుడు ఇప్పుడూ నష్త పోయేది మామూలు జనాభానే!ముఖ్యముగా విద్యార్దులే!
కులాలు మతాలు,రాష్ట్రాలు అంటు రెచ్చగొట్టి బప్పం గడుపుకునే దొంగ నాయకుల వలలో పది మీ జీవితాలను నాశనము చేసుకొని,మీ తల్లి తంద్రు ల కలలను నాశనము చేయకండి.మీవిలువైన సమయము వ్రుధా చేసుకుంటే ఆ తరువాత ఏంత విచారించి లాభము లేదు.అ రోజున ఏ రాజకీయ నాయకుడు మిమ్మలిని ఆదుకోడని అర్ధం చేసుకోండి.
ముందుగా మీ జీవితాని చక్క దిద్దుకోండి తరువాత దేశాన్ని వుద్దరిద్దురుగాని.అంతగా దేశానికి సేవచేయాలనుకుంటే మీ చదువు తరువాత సైన్యం లో చేరండి ,పొలీస్ లో చేరండి .అంతే కాని కుహానా రాజకీయుల నాయకుల చేతులలో మోసపోకండి.
కానీసము ఈ ఇంటర్వ్యులను చదివైనా నిజా నిజాలు తెలుసు కొండి.